7, జూన్ 2015, ఆదివారం

parti mari poya ika naketi

మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ర్ట ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఏడాదిపాటు కాంగ్రెస్‌లో వుండి ఎన్నో ప్రయత్నాలు చేశాను. అయినా కాంగ్రెస్‌లో వుండి ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నాను. కాంగ్రెస్ పోరాటల వల్ల ప్రజలకు మేలు జరగడంలేదు. టీడీపీ పరిపాలన ప్రజా వ్యతిరేకంగా వుంది. ప్రజలకు ఇచ్చిన హామీలని టీడీపీ నెరవేర్చడం లేదు. అందుకే ఒక బాధ్యత గల కాంగ్రెస్ నేతగానే రాజీనామా చేశాను. జగన్‌కి అండగా వుండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.
వైఎస్‌తో నాకు ఎంతో అనుబంధం వుంది. నన్ను నమ్ముకున్న వారికి న్యాయం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు వున్న అనుభవాన్ని ఇకపై వైఎస్సార్సీ కోసం ఉపయోగిస్తాను. పార్టీ నిర్ణయాలని క్రమశిక్షణతో అమలు చేస్తాను. కాంగ్రెస్ పార్టీ నాకే ద్రోహం చేయలేదు. నన్నేం కించపరచలేదు. కేవలం ప్రజలకు మేలు జరగాలనే తాను కాంగ్రెస్‌ని వీడి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాను. అంతకు మించి మరే స్వార్థం లేదని అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నట్లు తెలిపారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి