26, ఆగస్టు 2015, బుధవారం

acb trap

srikakulam muncipality lo iddaru engineers acb ki dorikaru. water works lo dee gaa panichesthunna a venkataramana, ae manoharraolu 9thousend rupees teesukunnaru. tejaporalal adireddi nunchi veeru lancham teesukuntunna samayamlo acb dsp rangaraju pattukunnaru

av ramana..dee

aee manohar


rangarju acb dsp 

23, ఆగస్టు 2015, ఆదివారం

jailuku vellina buddiraledu

అక్రమ మైనింగ్ కేసులో దాదాపు రెండేళ్ల వరకు జైలులో గడిపిన మాజీమంత్రి గాలి జనార్థన్‌రెడ్డి కదలికలు మళ్లీ మొదలయ్యాయి. పలు షరతులతో బెయిల్ తెచ్చుకున్న ఈయన, ప్రస్తుతం బళ్లారిలో వుంటున్నాడు. రీసెంట్‌గా గాలి జనార్థన్‌రెడ్డి క్లోజ్ అనుచరుడి బర్త్‌డే సెలబ్రేషన్స్ బళ్లారిలో ఘనంగా జరిగాయి. పసందైన విందు, గానా బజానాతో ఈ కార్యక్రమం వైభవంగా సాగిందట. ఈ వేడుకులకు మొత్తం ఖర్చు గాలి భరించినట్లు సమాచారం.
ఈ ‘గానా బజానా’కు టాలీవుడ్ నుంచి కొంతమంది సింగర్స్, కామెడీ టీం, టెలివిజన్ యాంకర్స్ కూడా వెళ్లినట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం. వీళ్లకి ప్యాకేజ్ కూడా భారీగానే ఇచ్చినట్లు సమాచారం. రాజకీయాల్లోకి రాకముందు తొలుత గాలి ఇలాంటి ఫంక్షన్స్ మొదలుపెట్టేవాడని, తాజాగా ఇప్పుడు అదేబాటలో పయనిస్తున్నాడని రాజకీయ నేతలు అప్పుడే చర్చించుకుంటున్నారు. ఏదైనేతేం మునుపటి వైభవం సాధించుకునేందుకు గాలి తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టేశాడని అనుకుంటున్నారు. 

rajadhani bhumulapai ratcha

ఏడాదికి నాలుగు లేదా మూడు పంటలు పండే భూములను నాశనం చేసి, రైతుల కన్నీళ్లతో రాజధాని కట్టవద్దని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇష్టపడి ఇస్తే భూములు తీసుకోవాలని, కాదని భూసేకరణకు దిగితే ధర్నాకు దిగుతానంటూ హెచ్చరించారు. తాను మాట్లాడిన ప్రతిమాట జాగ్రత్తగా మాట్లాడుతున్నానని అంటూనే, అలనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పాలనను గుర్తు చేశారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ విషయంలో భూములు కోల్పోయినప్పుడు మురళీమోహన్ ఎందుకు కోర్టుకు వెళ్లారని ప్రశ్నించారు. భూసేకరణకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్ ఆపాలని కోరుతూనే.. గుంటూరు ఎంపీ, మురళీమోహన్ వచ్చి రైతులతో సంప్రదింపులు చేయాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. కాదని టీడీపీ ప్రభుత్వం మొండిగా వెళ్తే, అప్పుడు తన విశ్వరూపం చూపిస్తానంటూ వాగ్భాణాలు సంధించారు. నిపుణులతో కమిటీ వేసి భూసేకరణ చట్టంలోని లోపాలను సరిదిద్దాలని కోరారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తనకు నమ్మకముందని విశ్వాసాన్ని పవన్ వ్యక్తం చేశారు.

annanu kalasina tammudu

మెగా బ్రదర్స్ మధ్య నడుస్తున్న ఓ డ్రామాకు తెరపడినట్లయ్యింది. చిరంజీవి 60వ బర్త్ డే వేడుకలకు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ దూరంగావున్నారన్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. షూటింగ్‌ని మధ్యలోనే రద్దు చేసుకుని నిలిపేసి హైదరాబాద్ వచ్చిన పవన్‌కల్యాణ్.. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు. మెగా అభిమానులకు సంబంధించి బర్త్ డే‌కు ముందురోజే ప్రత్యేకంగా జరిగిన సంబరాల్లో పవన్ స్టార్ లేకపోవడం ఒక వెలితిగా కనిపించింది.
పవర్ ఫ్యాన్స్ దీనిమీద ఓ మోస్తరు అల్లరి కూడా చేయడం నాగబాబు దానికి తీవ్రంగా స్పందించడం నిన్నటి వార్త. ఇంత గందరగోళానికి పవన్‌దే బాధ్యతంటూ చిరు అభిమానులు కూడా గుర్రుగా వున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి ఫంక్షన్‌కి తాను హాజరు కాకపోవడంపై అన్నయ్యకు పవన్ సంజాయిషీ ఇచ్చుకున్నట్లు సమాచారం. 

nagababuku kopam vatchindi

మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన సోదరుడు నాగబాబు కాస్త ఫైరయ్యారు. మెగా ఫ్యామిలీలో ఎవరి ఫంక్షన్ జరిగినా పవన్ కళ్యాణ్ అభిమానులు కేకలు, నినాదాలతో గడబిడ, హంగామా చేస్తుంటారు. దీంతో స్టేజీపై మాట్లాడుతున్నవారు ఇబ్బందిపడుతుంటారు. శుక్రవారం రాత్రి కూడా ఇదే జరిగింది.
వారి కేకలతో కాస్త సహనం కోల్పోయిన నాగబాబు-ఆయన (పవన్ కళ్యాణ్) ఈ ఫంక్షన్‌‌‌‌‌కు రాకపోతే మేమేం చేస్తాం..మేం రమ్మని ఎన్నిసార్లు పిలుస్తామో మీకు తెలుసా..? మా ఫంక్షన్లు వేటికీ రాడు..ఇక్కడ గోల చేయడం కాదు..మీకేమైనా దమ్ముంటే ఆయననే అడగండి..రమ్మని పిలుచుకుని రండి అని ఆవేశంగా అన్నారు. కాగా ఇన్నాళ్ళూ పవన్, నాగబాబు ఒక్కటే అన్నారు..

chiru ku 60 years

మెగాస్టార్ 60 జన్మదిన వేడుకలు ఎంత హంగు ఆర్భాటంగా జరిగినా.. కొందరు లేని, రాని లోటు స్పష్టంగా కనిపించిందని అక్కడికొచ్చినవాళ్లు మాట్లాడిన మాటలు. వస్తాడో రాడో అనుకున్న పవన్..  చిరు ఇంటికి వెళ్లి మరీ బర్త్ డే విషెస్ చెప్పి గంటపైగా అక్కడ కూర్చొని మళ్ళీ పార్క్ హయత్ పార్టీ‌లో అటెండ్ కావడం హైలైట్ అంటున్నారు. కానీ రెండుచోట్లా పవన్ మరీ సీరియస్‌గా ఉంటూ ఫ్యాన్స్ కోసం తప్పదన్నట్టుగా వచ్చినట్టుగానే ఉందనే కామెంట్స్ వచ్చాయి. 
అలానే స్పెషల్ ఇంటర్వ్యూస్‌లో బాలకృష్ణ పేరు ప్రస్తావించకుండా మిగతా మోహన్‌బాబు, నాగార్జున, వెంకీ, రవితేజ, శ్రీకాంత్ అందరూ మిత్రులే అన్నాకూడా బాలయ్య హాజరై అందరికీ షాక్ ఇచ్చాడు. వీటన్నిటికంటే  చిరుతో సూపర్ హిట్ కాంబో అనిపించుకున్న రాధిక, విజయశాంతి, కృష్ణ హాజరుకాకపోవడం ఈ వేడుకల్లో హాజరు కాకపోవడం లోటే అని కామెంట్స్ వినిపించాయి.