1, అక్టోబర్ 2015, గురువారం

mega daughter niharika cini entry

నాగబాబు కూతురు నిహారిక టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోందంటూ కొద్దిరోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఎప్పుడు? ఏంటి? అనే విషయంలో ఎక్కడా క్లారిటీ లేదు. తాజాగా ఫిల్మ్‌నగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు.. మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మధుర శ్రీధర్‌ ఓ ఫిల్మ్‌ని నిర్మించబోతున్నాడు. ఈ సినిమా ద్వారా నిహారిక తెలుగు తెరకు పరిచయం కానుంది.
‘మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు’ మూవీ ఫేం రామరాజు, దీన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ప్రజెంట్ ప్రీ- ప్రొడక్షన్‌ కార్యక్రమాలు స్పీడ్‌గా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అక్టోబర్‌‌లో షూటింగ్‌ మొదలయ్యే ఛాన్స్ వుంది. నాగశౌర్య పక్కన నిహారిక హీరోయిన్. నిహారికను తమ బ్యానర్‌ ద్వారా ఎంట్రీ ఇవ్వడం హ్యాపీగా వుందని ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్‌ చెప్పుకొచ్చాడు. అభినయ్‌, డాక్టర్ కృష్ణభట్ట దీనికి సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి